త్రిష, ఖుష్భూ, చిరంజీవిపై మద్రాసు హైకోర్టులో నటుడు మన్సూర్ అలీఖాన్ వేసిన పరువునష్టం దావాను కోర్టు కొట్టేసింది. మీరు చేసిన వ్యాఖ్యలకు త్రిషనే మీపైన తిరిగి కేసు పెట్టి ఉండాల్సింది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘మీరో నటుడు. యువత మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఇలా పద్దతి లేకుండా ప్రవర్తించడం సరైనదేనా..? బయట జరిగేవి మాకు తెలీదు అనుకుంటున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పిటిషన్ ను కొట్టేసింది.
