ఆర్టికల్ 370 రద్దుపై చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా తన స్పందనను తెలియజేసింది. లఢఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము గుర్తించడం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తెలిపారు. లఢఖ్ను భారత్ ఏకపక్షంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు చైనా-భారత సరిహద్దుకు సంబంధించిన వాస్తవ స్థితిని మార్చలేదని ఆమె అన్నారు.
