వరుస సినిమాలతో మాస్ మహారాజా హీరో రవితేజ దూసుకుపోతున్నాడు. తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే, గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా కోసం కేటాయించిన డేట్స్ను, ఈ మూవీకి షిఫ్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలకపాత్రకు తమిళ హీరో విక్రమ్ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
