ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మనసు కొల్లగొట్టిన టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పూత్. తాజాగా ఆమె డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ సినిమాలో నటించారు. మిస్టీరియస్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ హక్కులను దక్కించుకుందని, డిసెంబర్ 26న స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
