UPDATES  

 నగరంలో డ్రగ్స్ కలకలం.. 12 మంది అరెస్ట్..

డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వెంటనే ఆ దిశలో అధికారులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 12 మందిని అరెస్ట్ చేశారు.

 

పట్టు పడిన నిందితులది నెల్లూరు జిల్లా అని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. నెల్లూరులోను డ్రగ్స్ పిల్స్ విక్రయించినట్టు నిందితులు బయటపెట్టారు. అయితే ఇందులో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

తీగ లాగితే నెల్లూరులో డొంక కదులుతోందన్నట్లు.. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి ఛైర్మన్ కుమారుడు ప్రేమ్‌చంద్‌ బర్త్‌డే వేడుకల కోసం గోవా నుంచి మాదకద్రవ్యాలు తెప్పించడం కలకలం రేపుతోంది.

 

30 మంది కోసం ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని.. ప్రముఖ సాఫ్ వేర్ కంపెనీలో ఇంజనీర్లు అందరూ కలిపి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం . ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ? ఎంత మొత్తంలో విక్రయించారు? ఎవరెవరు కస్టమర్లు ఉన్నారనే కోణంలో నార్కోటిక్ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !