తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులపై కేంద్రం చర్యలు తీసకుంది. 55 లక్షల ఫోన్ నెంబర్లను తాజాగా రద్దు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దేవుసింహ్ చౌహాన్ పార్లమెంటులో వెల్లడించారు. భారీ ఎత్తున వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టామని, తప్పుడు ధృవపత్రాలతో పొందిన 55.52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు తెలిపారు. అలాగే సైబర్ నేరాలకు ఉపయోగించిన 1.32 లక్షల నంబర్లను కూడా బ్లాక్ చేసినట్టు వివరించారు.
