దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు భారత్లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అధ్యక్షతన జరగబోయే హైలెవెల్ మీటింగ్లో మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశ నిర్దేశం చేయనున్నారు. కాగా దేశంలో రోజూరోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ తప్పదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
