మన్యం న్యూస్ భద్రాచలం;
ఎటపాక మండలం గుండాల సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కు గుండాల సర్పంచ్ గుండి సీతాలక్ష్మి, గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, హాజరై ఈ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను ఉద్దేశించి గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ను భారీగా సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం మరో రెండు సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర కోకో అసోసియేషన్, ఆంధ్ర వాలీబాల్ అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, తోను ఒప్పందాలు చేసుకుందిఅని తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, గ్రామ మండల స్థాయి కమిటీల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఈ ఆటలు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు దశల్లో జరుగుతాయని తెలిపారు , ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకట రామిరెడ్డి, గుండాల సర్పంచ్ గుండి సీతాలక్ష్మి, సచివాలయ సెక్రటరీలు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మరియు క్రీడాకారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.