మన్యం న్యూస్ గుండాల: గుండాల నుండి మేడారంకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించింది. పస్రా లో ఉదయం 9 గంటలకు బయలుదేరి గుండాలకు 11 గంటలకు చేరుకుంటుందని 11:15 నిమిషాలకు గుండాలలో బయలుదేరి మేడారం చేరుకుంటుంది. జాతర సమయంలో ఆర్టీసీ మీ సేవలు ప్రారంభించడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని గుండాల సీఐ రవీందర్, ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
