ఒక్క బిర్యానీ తిని రూ.7 లక్షల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతి నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన బిర్యాని లక్కీ డ్రా లో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందాడు. సెప్టెంబర్ లో రోబో హోటల్ వినూత్న స్కీం ప్రవేశపెట్టింది. బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ అందజేసింది. సుమారు 23 వేలకు పైగా కూపన్లు చేరాయి. నూతన ఏడాదిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి డ్రా తీయగా రాహుల్ విజేతగా నిలిచాడు.
