టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషనల్లో వచ్చిన చిత్రం ‘ఏజెంట్’. గతేడాది ఏప్రిల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి.
