UPDATES  

 మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం.. అయోధ్య రామయ్యకు రూ. 14.25 లక్షల విరాళం..

హనుమాన్ సినిమా ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షల రూపాయలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది . ప్రతి టికెట్‌పై రూ. 5 చొప్పున విరాళం ఇస్తామని ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. సినిమా ప్రదర్శినన్ని రోజులు విరాళం ఇవ్వనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. విరాళాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ రూపొందించి అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్‌రెడ్డి తెలిపారు.

 

జాంబీరెడ్డి సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.. తేజ సజ్జా కాంబినేషన్‌లో హను-మాన్‌ మూవీని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమృత అయ్యర్‌ హిరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కోటి అనే వానర పాత్రకు హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించారు. రాష్ట్రవాప్తంగా 11న ప్రీమియర్ షో లను ప్రదర్శించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !