రాజకీయ అంశాలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో తనను అభ్యర్థిగా నిలబెట్టేందుకు మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రాజకీయ పార్టీలు తన సిద్ధాంతంతో తన వెనుకపడటం లేదని, తాను ప్రధాని మోడీని విమర్శించడం వల్ల తన వెంట పడుతున్నారని అన్నాడు. తాను ఆ ఉచ్చులో పడకూడదని అనుకుంటున్నట్లు ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు.
