సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.900 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 26న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
