అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల నుంచి భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా 5 లక్షల లడ్డూలు అయోధ్యకు చేరనున్నాయి. ఈ లడ్డూల తయారీని సీఎం మోహన్ యాదవ్ పర్యవేక్షించారు.
