UPDATES  

 ఆపదలో ఉన్న వారికీ ఆసరాగా నిలుస్తున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్.

 

మన్యం న్యూస్, మంగపేట

మంగపేట మండలం కమలాపురం గ్రామం లో ఇద్దరు అమ్మాయిలు దంధ్యాల రాణి 15, రమ్య 14 సంవత్సరాలు వీరికి తల్లి తండ్రులు లేరు, వీరు రోజువారీ కూలి పనులుకి వెళ్లి జీవనం గడుపుతున్నారు వీరికి ఉండడానికి సొంత ఇల్లు, సరియైన బట్టలు కూడా లేవు ఈ విషయం కమలాపురం గ్రామస్థులు మండలంలోని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో దాతల సహాకారంతో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వీరికి మంచం,పరుపు,గిన్నెలు,బియ్యం, చద్దరులు సుమారుగా 10 వేల రూపాయల నిత్యావసర సరుకులు అందచేశారు , ఈ విషయం తెలుసుకున్న మంగపేట ఎసై రవికుమార్, 5 వేల రూపాయలు సహాయం అందజేశారు. వీరికి సహాయం చేయడానికి ఇంక ఎవరైనా దాతలు ఉంటే ( A/C.086612010002064) చారిటబుల్ ట్రస్ట్ కు పంపించాలని,ఈ పిల్లలకు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది అదే విదంగా వారిని చదివించడానికి ఎసై రవి కుమార్ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చదివిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో జ్వాలా ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ వైస్ చైర్మన్ పుల్లంశెట్టి అజేయ్ కస్ప ముకుందాం కార్యదర్శి బండపెల్లి రవి గౌడ్ ఆత్మకూరు సతీష్ కోశాధికారి ముప్పారపు రాజు మీడియా ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ సోషల్ మీడియా ఇంచార్జి జై బీమ్ రాంమోహన్ నూతులకంటి రాకేష్ ముఖ్య గౌరవ సలహాదారులు కొలగట్ల నరేష్ రెడ్డి చాద మల్లయ్య ఎస్ డి బాబా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !