ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అన్ని సినిమాలను వెనక్కి నెట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ‘బుక్ మై షో’లో ఏకంగా 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో ఇదే రికార్డు.
