- దండు కారణ్యంలో సైరన్ మోతలు ముగిస్తున్న తుపాకి తూటాలు
- మూడు సిఆర్పిఎఫ్ క్యాంపు లపై మూకుమ్మడి దాడి చేసిన మావోలు.
- భయం గుప్పట్లో ఆదివాసి గ్రామాలు.
మన్యం న్యూస్ చర్ల.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు అటవీ ప్రాంతంలో యుద్ధ భీముని తలపిస్తున్న దండుకారుణ్యం
ఎక్కడ చూసినా తుపాకులు మోతతో ఏజెన్సీ గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి . మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య బీకరపోరు జరిగింది. బెటాలియన్ క్యాంపు లపై కాల్పులు జరిపిన మావోయిస్టులు. మూడు151 సిఆర్పిఎఫ్ క్యాంపు లపై రాకెట్ లాంచర్ తో విరుచుకపడ్డారు.
మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మావోయిస్టులు మూడు సిఆర్పిఎఫ్ క్యాంపులు పామేరు ధర్మారం చింతవాగు క్యాంప్లపై ఒకే సమయంలో కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన సిఆర్పిఎఫ్ బలగాలు వారిపై ఎదురు కాల్పులు దిగారు
వారి ఎదురు కాల్పులలో యుద్ధభూమి అంత అరణ్యంలో ఎక్కడ చూసినా కాళీ బుల్లెట్లు పేలని లాంచర్లు తో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఎటువంటి హాని జరగలేదని పై అధికారులు తెలిపారు రహదారి నిర్బంధం చేసి కాల్పులు జరిపిన మావోలు.
కాల్పులు జరగక ముందే గ్రామానికి వచ్చే రహదారుల్లో చెట్లు నరికి తగలబెట్టారు. అంతేకాకుండా ధర్మారం వెళ్లే దారిలో కల్వర్టు వద్ద బాంబు పేల్చి వాహనాల రాకలను అడ్డుకున్నారు. వాహనదారులను మావోయిస్టు జిరుపల్లి రహదారి మీదుగా వెళ్లాలని కోరున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక క్యాంపు నుండి ఇంకొక క్యాంపుకు జవాన్లు రాకపోకలు జరపకుండా ఉండటమే ముఖ్య అజెండాతో బాంబు పేల్చినట్టుగా వినపడుతున్న అంశం. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కు పాదం మోపిన నేపథ్యంలో దండుకారంలో తుపాకుల మోత నిత్య కృత్యమైపోయింది అన్నట్టుగా మావోయిస్టులు సైతం అధును చూసి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో దండకారణంలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆదివాసి గ్రామాలలో భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి..