గుజరాత్లోని వడోదరలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అనూహ్య ప్రమాదంలో దిగ్బ్రాంతికి గురయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ఇస్తామన్నారు. ప్రమాదంపై ఆరా తీసిన మోదీ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.
