అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాలను రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లలో సుమారు 9000 స్క్రీన్లు ఏర్పాట్లు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈనెల 22న జరగనున్న సంగతి తెలిసిందే.
