బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. అమెజాన్ ప్రైమ్లో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు పాజిటివ్ టాక్ రావడంతో భారీ వ్యూస్తో దూసుకెళ్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాల్లో ప్రస్తుతం టాప్-10 ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ తాజాగా వెల్లడించింది.
