మన్యం న్యూస్ గుండాల: సంఘవిద్రశక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని గుండాల సీఐ ఎల్ రవీందర్ అన్నారు. మంగళవారం ఆళ్లపల్లి మండలం అడవిరామారం గుత్తి కోయ గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు సంఘవిద్ర శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే మా ఉన్నతాధికారులు, మిగతా శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని అన్నారు. పిల్లల చదువు కోసం పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులే కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎస్సై రతీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు