UPDATES  

 విద్య నైపుణ్యంతోనే బాలికల హక్కులు రక్షించబడతాయి..

 

మన్యం న్యూస్ వాజేడు

మండల కేంద్రంలో

కె జి బి వి పాఠశాలలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి. రమాదేవి జి

సి డి ఓ

బాలికల శారీరక ఎదగుదలను మానసిక ఒత్తిడి ని, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి, జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి , జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలి సూచించారు. విద్య నైపుణ్యాలు అందించడం వల్ల బాలికల హక్కులు రక్షించబడతాయని తెలిపారు. బాలికల సమస్యల పరిష్కారణ కొరకు 1098 ఫోన్ నంబర్ సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుజాత, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !