ధనుష్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నాగార్జున మీద కొన్ని సన్నివేశాలను హైదరాబాదులోని చంచల్ గూడ జైలులో చిత్రీకరిస్తుండగా ఆయన హాజరైనట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల నుండి చంచల్గూడ జైలులో అవుతుందని.. మరో రెండు రోజులు అక్కడే జరుగుతుందని తెలుస్తోంది.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)