మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న భారత్ను దూరం చేసుకోవడం దేశానికే హానికరమని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) నేతలు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జును హెచ్చరించారు. హిందూ మహా సముద్రంలో శాంతి, సుస్థిరత మాల్దీవుల భద్రత చాలా కీలకమని గుర్తు చేశారు. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ పేర్కొన్నారు.