మోసం కాంగ్రెస్ నైజం.. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్.. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘అందుకే కాంగ్రెస్ ను వీడి.. టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఒంటరి పోరు.. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్..దేశ ప్రజలను ఏం మెప్పిస్తుంది. మోదీని, బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదు.. ఇండియా కూటమికి అంతకన్నా లేదు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం.’ అని ట్వీట్ చేశారు.