కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి చిరుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవికి ఈ గౌరవం దక్కినందుకు ఆయన కోసం ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని తెలిపారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. దీంతో సినీ ప్రముఖుల మధ్య చిరంజీవికి ఘనంగా సన్మానం జరగనుంది
