భర్తకు ఆదాయం లేకపోయినా విడాకుల తర్వాత భార్యకు భరణం అందించాల్సిన బాధ్యత భర్తపై ఉందని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. భార్య నుంచి విడిపోయిన ఓ రోజుకూలీ, కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య టీచర్గా రూ.10వేలు సంపాదిస్తుందని, తాను రోజుకూలీనని.. తనపై చెల్లెళ్లు, తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ, కూలీపని చేసైనా భరణం ఇవ్వాలని కోర్టు తేల్చింది.