మెగాస్టార్ చిరంజీవిని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ కలిశారు. పద్మవిభూషన్ పురస్కారం రావడంతో చిరంజీవిని స్వయంగా కలిసి భరత్ శుభాకాంక్షాలు చెప్పారు. ఈ విషయాన్ని భరత్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా కేఎస్ భరత్ తన టెస్టు జెర్సీని చిరంజీవికి అందించారు. ’తెలుగువాడిగా భారత జట్టులో అద్భుతంగా రాణిస్తున్నావని, మున్ముందు గొప్ప పురస్కారాలు నువ్వు కూడా పొందాలని భరత్కు‘ చిరంజీవి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
