కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా CAAని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల కాక్ ద్వీప్లో జరిగిన బహిరంగ సభలో ఈ హామీ ఇచ్చారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)