మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామం లో మూడు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా గ్రామ కార్యదర్శి గా,గ్రామ రెవిన్యూ అధికారిగా విశిష్ట సేవలు అందించిన పత్రి బానయ్య అనారోగ్యంతో ఆది వారం రాత్రి మృతి చెందగా సోమవారం ఉదయం బానయ్య స్వగ్రామమైన గోవిందరావుపేట మండలం పస్ర లో పత్రి బానయ్య భౌతిక కాయాన్ని సందర్శించి పుష్ప గుచ్చంవుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బానయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ పత్రి బానయ్య రెవిన్యూ శాఖలో గోవిందరావుపేట మండలం చల్వాయి,మంగపేట మండలం అకినేపల్లి మల్లారం రమణక్కపేట గ్రామాలలో విశేష సేవలు అందించి ప్రజల మనసు చూరగొన్నారని అన్నారు. బానయ్యలేని లోటు తీరనిదని నాసిరెడ్డి సాంబశివరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆయన వెంట పెసా మొబిలైజర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బుల ముత్యాలరావు తొండపు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దూలగొండ నారాయణ చెట్టుపెళ్లి సోమయ్య బాలు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.