తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని ఎస్పీ పరమేశ్వర్ రద్దు చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేపు గోవింద రాజస్వామి గుడి వద్ద షూటింగ్ చేయనున్న చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ తగిలింది. మంగళవారం అలిపిరి వద్ద చిత్ర యూనిట్ షూటింగ్ నిర్వహించగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో భక్తులు, బీజేపీ నేతలు షూటింగ్ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
