తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ చిత్రంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని తన స్నేహితులతో కలిసి వీక్షించిన ఆయన, అనంతరం ట్విట్టర్ వేదికగా తన అనుభూతిని షేర్ చేశారు. ‘దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులోని ప్రతి సన్నివేశం ఆకట్టుకుంది. అందరూ చక్కగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు’ అంటూ ‘హనుమాన్’ టీమ్తో దిగిన ఫొటోను పంచుకున్నారు
