UPDATES  

 గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు..తడుముకుంటున్నారు…

  • గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు
  •  తడుముకుంటున్నారు.
  •  గంజాయి పేరెత్తితే చాలు ఉలిక్కిపడుతున్న పలు రాజకీయ నాయకులు.
  •  గంజాయి వార్త రాసిన విలేకరిపై దుష్ప్రచారం. చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వైనం.
  •  ఈ విషయాలపై ఘాటుగా స్పందించిన సుప్రీంకోర్టు లాయర్.

 

మన్యం న్యూస్ నూగూరు వెంకటాపురం.

 

ఇటీవల కాలంలో గంజాయి పై వస్తున్న కథనాలకు చతిస్గడ్ మధ్యప్రదేశ్ నుండి గుట్టుగా తరలిస్తున్న గంజాయిని అనేకసార్లు వాజేడు వెంకటాపురం మండల పోలీసులు చాకచక్యంగా చేదించారు. ఇదిలా ఉండగా దొంగ చాటున పట్టుబడ్డ గంజాయి వార్తకు కొంతమంది రాజకీయ నాయకులు, పరోక్షంగా స్పందిస్తున్నారు. రాసిన పత్రిక విలేకరిపై దుష్ప్రచారం చేస్తూ మండలంలో మన్యం న్యూస్ పత్రిక విలేఖరి పరువు తీయడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గంజాయి వార్తలపై పలు రాజకీయ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారో ఎందుకు పరోక్షంగా విలేకరిపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నది అద్దం పట్టడం లేదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుము కున్నట్టు వార్త వస్తే చాలు ఉలిక్కిపాటుకు గురవుతున్న పరిస్థితులు మండల కేంద్రంలో నెలకొన్నాయి. అసలు రాసిన వార్తకు ఎందుకు పరోక్షంగా స్పందిస్తున్నారో అంతు చిక్కడం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పోలీసులు కళ్ళు కప్పి గంజాయిని తరలిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అయితే విలేకరిపై వారి వైఖరి నిజంగానే గంజాయి ని వాళ్లు స్మగ్లింగ్ చేస్తున్నారని అనుకోవాలా? అనేలా వారి ప్రవర్తన పలు అనుమానాలకు తావినిస్తున్నాయి. ఈ విషయం పట్ల ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

వెంకటాపురం మండలం మొత్తం అవినీతికి గురైందని ఒక గంజాయిలోనే కాదు భూముల విషయంలోనూ మండలాన్ని దోచుకుంటున్నారు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రౌడీషీటర్లు చాలా చిన్న మోతాదు దొంగలని అసలు దొంగలు ఇంకా బయట పడలేదని వారు తెలిపారు. రౌడీ షీటర్లుగా ముద్రపడిన వారిని అసలు దొంగలే నడిపిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

వెంకటాపురం మండలంలో గంజాయి కంటే ఎక్కువ. భూకబ్జాలు జరుగుతున్నాయని అవి పూర్తిగా ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ సెటిల్మెంట్ జమీందార్ పట్టాలు అని తెలిపారు. అవి చెల్లకపోయినా నిజమని ఎమ్మార్వో ను సైతం మచ్చిక చేసుకొని ఫోర్జరీ సంతకాలతో కూడిన పేపర్లు నిజమైన పట్టాలుగా చిత్రీకరిస్తూ బీద పేద ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్నారు అంటూవారు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంలో వరంగల్ మాజీ మంత్రి కూడా హస్తo ఉన్నట్ట వెల్లడించారు. దీంట్లో ప్రథమంగా వినిపించేది జమీందారు పేరే అని రౌడీ షీటర్ లో ఆయన పేరు ఉండడం మండల ప్రజలకు న్యాయం చేసినట్టుగా అయింది అంటూ రౌడీ షీటర్ ఓపెన్ చేసిన మండల పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !