ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 26న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
