మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్ర విద్య వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేయాలని కొత్తగూడెం జిల్లా టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని కాచనపల్లి ఆశ్రమ పాఠశాలలో టి పి టి ఎఫ్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు సిపిఎస్ రద్దు చేయాలని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను నింపాలని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
