UPDATES  

 మంగపేట ఎస్ ఐ చేతుల మీదుగా ప్రతిభా పరీక్ష కరపత్రం ఆవిష్కరణ…

 

మన్యం న్యూస్, మంగపేట.

ఎస్ఎఫ్ఐ మంగపేట మండల. కమిటీ ఆధ్వర్యంలో

నిర్వహిస్తున్నటువంటి పదవ తరగతి ప్రతిభ పరీక్ష కరపత్రాన్ని మంగపేట ఎస్సై రవికుమార్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై రవి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందే నిర్వహించడం అభినందనీయం. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ అంటే చాలామంది విద్యార్థులు భయాందోళనలో గురి అవుతా ఉంటారు.వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ఉన్న ప్రతిభని వెలికి తీయడం కోసమే ఈ ఎస్ఎఫ్ఐ ఎస్ఎస్సి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులు కస్టపడి, ఇష్టపడి చదివి సంవత్సరం పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.ఈ పరీక్షలో విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని,సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.ఇది పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం అని అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో జరిగే అటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి మాట్లాడుతూ

ఎస్ ఎఫ్ ఐ మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం రోజున టాలెంట్ టెస్ట్ అన్ని మండల కేంద్రాలలో నిర్వహిస్తున్నాము.ఈ టాలెంట్ టెస్ట్లో 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము 1970వ సం|| లో ఏర్పడిన ఎస్ ఎఫ్ ఐ ” అధ్యయనం- పోరాటం” అనే ఆచరణాత్మక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. విద్యారంగ సమస్యల పరిస్కారానికి అనునిత్యం పోరాడుతూనే విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడాలని ఎస్ ఎఫ్ ఐ మీకు గుర్తు చేస్తూ, త్వరలో జరుగనున్న పబ్లిక్ పరీక్షలకు మిమ్మలను సిద్ధం చేసేందుకు మరియు భవిష్యత్లో జరిగే పబ్లిక్ పరీక్షలో విజయం సాధించాలని రాష్ట్రంలో ప్రముఖ విద్యావేత్తలు చుక్కా రామయ్య, మాజీ శాసన మండలి సభ్యులు డా॥ కె. నాగేశ్వర్ లచే నూతన సిలబస్ ఆధారంగా మల్టిపుల్ చాయిన్ రూపంలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం నందు రూపొందించిన ప్రశ్నాపత్రములతో ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ను నిర్వహిస్తున్నాము.మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు. 7287829727,…7660061716,…7601091296

1) టాలెంట్ టెస్ట్లో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులు 16వ తేదీ లోపు సంబంధిత ప్రధానోపాధ్యాయుల వద్ద కానీ, ఎస్ ఎఫ్ ఐ కార్యాలయంలో కానీ పేర్లు నమోదు చేసుకోవాలి.

2) టెస్ట్లో 100 ప్రశ్నలకు వంద మార్కులు, తెలుగు-10, ఇంగ్లీష్-10, గణితం-30, భౌతికశాస్త్రం -20, జీవశాస్త్రం -15, సాంఘీకశాస్త్రం-15.

3) పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

4) పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లాస్థాయిలో- 10 ర్యాంకులకు, ప్రతీ మండలానికి- 3ర్యాంకులకు ప్రత్యేక బహుమతులు ఇవ్వబడును.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శి జాగటి రవి తేజ మంగపేట మండల అధ్యక్ష కార్యదర్శులు జాడి యుగేందర్ వంకాయల సిద్దు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !