మన్యం న్యూస్ గుండాల: తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదివాసి తెగల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జవ్వా జి లక్ష్మీనారాయణ స్తూపం వద్ద సమ్మేళన కరపత్రాన్ని ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 13వ తారీఖున మేడారంలో ఆదివాసి సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూనెం శ్రీను, లజ్జ ఎర్రయ్య, మోకాళ్ళ కన్నయ్య, సాంబయ్య, గోవిందా నరసింహారావు, కిషన్ రావు, చింతా వెంకటేశ్వర్లు, సంతోష్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు