UPDATES  

 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు..

మన్యం న్యూస్ గుండాల: దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు తెలిపిందని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు. బుధవారం మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మె ఉన్నందున ఆ సమ్మెకు మా పార్టీ సంపూర్ణ మద్దతు పలికిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి చేసేందుకు కుట్రలు చేస్తుందని అన్నారు. మద్దతు తరగతిలో ఉండే ప్రజలు అత్యధికంగా పాలసీలు ఉన్న ఎల్ఐసి ని కూడా అమ్మాలని చూడడం సరైనది కాదని అన్నారు. కార్మిక రంగానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చల సారయ్య, మల్లేష్, శ్రీను, లింగన్న ఉపేందర్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఇర్ఫా రాజేష్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !