మన్యం న్యూస్ గుండాల:దేశంలోని విప్లవకారులంతా ఏకతాటి మీదికి రావాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్లాస్టిక్ ప్రమాదం పెరుగుతుందని అన్నారు. దేశంలోని మూడు విప్లవ పార్టీలు ఐక్యత చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీలన్నీ ఐక్యమవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అందులో భాగంగానే మార్చి నెలలో ఖమ్మం నగరంలో బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్ణయిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ధనవంతులు పెరుగుతున్నారని వ్యవసాయ కూలీలు మాత్రం ఎప్పటికీ అక్కడే ఉంటున్నారని అన్నారు
ఖమ్మంలో జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నాయిని రాజు, ఈ సామ్ శంకర్, యాకుబ్ షావలి, ఆర్ఎస్సి బోస్, పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్, కొమరం శాంతయ్య, బోర్ర వెంకన్న, పిడిఎస్యు కార్యదర్శి పృద్వి, కోడూరి జగన్ తదితరులు పాల్గొన్నారు