కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘భీమా’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఏదో ఏదో మాయ అనే ఫస్ట్ సింగల్ ప్రోమోని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనునట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ నుంచి ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ మూవీ మార్చి 8న విడుదల కానుంది.
