టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగా ‘గ్రేట్ ఆంధ్ర’తో సందీప్ కిషన్ మాట్లాడాడు. “ఈ కథ అంతా ఒక మిస్టీరియస్ గా అనిపించే ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా భయపెడుతుంది.. భయపడుతూనే చూడాలనిపించేలా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.
