UPDATES  

 ప్రధాని మోదీ ఓబీసీ కాదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

ప్రధాని మోదీ ఓబీసీ కాదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. రాహుల్‌ ఆరోపనలపై వాస్తవాలు అంటూ మోదీ జన్మించిన కులం గురించి స్పష్టత ఇచ్చింది.

 

ప్రధాని మోదీ ఘాంచీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారని కేంద్రం బదులిచ్చింది. 2000 సంవత్సరంలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఆ కులాన్ని ఓబీసీ విభాగంలో చేర్చిందని వివరించారు.

 

గుజరాత్‌లో ఒక సర్వే అనంతరం మండల్ కమిషన్‌ సిపారసుల మేరకు 91(A) ఇండెక్స్‌ కింద ఓబీసీ జాబితాను తయారుచేసింది. అందులో ఘాంచీ కులం పేరు కూడా ఉంది. దీనిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు జులై 25, 1994లో నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు మోదీ స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 4, 2000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా దానిని ఓబీసీ జాబితాలోకి చేర్చారు. ఈ రెండు ప్రకటనలు ఇచ్చిన సమయంలో మోదీ అధికారంలో లేరని కేంద్రం వెల్లడించింది.

 

అయితే ఎన్నికల సమయంలో మాత్రమే మోదీకి తాను ఓబీసీననే విషయం గుర్తుకు వస్తుందని కొద్దిరోజుల క్రితం రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. లేకపోతే కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే అని మోదీ చెప్తారని రాహుల్ అన్నారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి బుధవారం పార్లమెంట్‌లో మోదీ స్పందించారు.

 

దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూను కాంగ్రెస్ గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను గుడ్డిగా అనుసరిస్తున్నారని మోదీ గట్టిగా వ్యతిరేకించారు. తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చామని ఆయన త వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !