దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తాజాగా బుధవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 157 మందికి కరోనా వైరస్ కేసులు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇవి భారీ కేసులు కానప్పటికీ ఈ మధ్యకాలంలో నమోదైన అత్యధిక కేసులు కావడంతో వివరాలను వెల్లడించింది
