రోదసి రంగంలో మరిన్ని విజయాల నమోదుకు భారత్ సిద్ధమవుతోంది. వచ్చే 14 నెలల్లో సుమారు 30 ప్రయోగాలు జరుగుతాయని అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్’ వెల్లడించింది. ఇందులో ప్రతిష్ఠాత్మక ‘గగన్యాన్’కు సంబంధించిన ఏడు పరీక్షలతోపాటు స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంకుర సంస్థలకు చెందినవి ఏడు మిషన్లు ఉన్నట్లు తెలిపింది. 2024-25లో మిగతావి నిర్వహించనున్నారు. వాటి తేదీలను ప్రకటించాల్సి ఉంది.
