UPDATES  

 భారత్ బంద్ ను జయప్రదం చేయండి…అఖిలపక్ష రాజకీయ పార్టీలు..

మన్యం న్యూస్ కరకగూడెం : ఈనెల 16న రేపు జరగబోయే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కరకగూడెం మండల కేంద్రంలో టిడిపి, సిపిఎం,సిపిఐ అఖిలపక్ష పార్టీలు మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు సిరిశెట్టి కమలాకర్, కొమరం కాంతారావు, వంగరి సతీష్ లు మాట్లాడుతూ కార్మిక సంఘాలు రైతు సంఘాలు రాజకీయ పార్టీలు కార్మిక కర్షకుల ఐక్యత తో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు, దేశంలో బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోడ్స్ రద్దు,విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు ఫరం చేయకుండా ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కనీస మద్దతు ధర చట్టం చేయాలని, ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచి 600 కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ అన్ని స్కీం లకు బడ్జెట్ పెంచి కనీస వేతనాలు అమలు చేయాలని వారిని అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం రంగం, ఐకెపి, గ్రామ పంచాయతీ వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ధరల పెరుగుదలను అరికట్టాలని ఆహార వస్తువులు మరియు నిత్యవసరాలపై జిఎస్టిని ఉపసంహరించాలని, పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటగ్యాస్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్నీ తగ్గించాలని, చౌక ధరల దుకాణంలో 14 రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలని, నిత్యవసర సరుకులు ధరలు తగ్గించి ప్రజలకు సార్వత్రిక నాణ్యమైన ఆరోగ్యం విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని, జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పి) 2022 ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు బోడ ముత్తయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !