నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లో కూడా చోటు దక్కించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మీకు సమాచారం ఇవ్వడం కోసం తెలియజేస్తున్నాము. ఈ రోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము’ అంటూ రాసుకొచ్చింది. అలాగే శ్రద్దా దాస్తో ఉన్న పిక్తో పాటు ఇద్దరి కాళ్లను కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.
