పాములను,పశువులను సైతం పూజించే పవిత్ర భారత దేశం లో పసి పిల్లలపై దాడులా..
పల్లికొండ యాదగిరి.
గవాక్షం ప్రతినిధి, మంగపేట.
భారత దేశంలో ఏదో ఒక చోట దళిత జాతి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి, దేవాలయం లోకి ప్రవేశించిన దళిత మహిళ ను కొట్టి చంపారు, దేవాలయం లో కుళాయి నీళ్లు త్రాగినందుకు ఉత్తరప్రదేశ్ లో సంబల్పూర్ లో దళిత చిన్నారులపై దాడులు, ఇప్పుడు
బావిలో నీళ్లు త్రాగారని దళిత పిల్లలను అతి క్రూరంగా కట్టేసి కొట్టిన ఘటనను మనం చూశాము. ఏమైంది ఈ దేశానికి నాగరికత పెరిగిన కూడా కులం పేరిట, మతం పేరిట దాడులు చేయడం సిగ్గు చేటు.ఇటువంటి దాడులు ఎక్కడ జరిగిన ప్రతి ఒక్కరు ఏక తాటిపై తీవ్రంగా ఖండించాలి. ప్రపంచం దేశాలకు భారత దేశం అంటే ఎంతో భక్తి భావం, భారత దేశం లో ప్రకృతి ని,పాములను, పశువులసైతం ఆరాధిస్తారు,అటువంటి పవిత్ర భారత దేశం లో పసి పిల్లల పై దాడులా, సిగ్గు చేటు, కులం పేరిట, మతం పేరిట కొంతమంది ఉన్మాదులు చేసే ఈ వికృతపనుల వలన దేశం యావత్తు ప్రపంచం ముందు తల దించు కోవాల్సిన పరిస్థితి.ఇటువంటి సంఘటన లు మరల జరగకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉంది. ఈ అమానవీయ దుచ్చర్య ను తీవ్రంగా ఖండి స్తునానని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి అన్నారు.