మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ సినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 51.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. సినిమాకి తొలి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు వస్తున్నాయి. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి దావ్ జంద్ సంగీతం అందించారు.
