శ్రీరాముడు, శ్రీకృష్ణులకు గౌరవ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంఘాలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్రన్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్కు హిందూ సంఘాలు లేఖ రాశాయి. హిందువులంతా భగవంతుని స్వరూపంగా కొలిచే శ్రీరాముడు, శ్రీకృష్ణులపై ఎవరైనా అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష విధించేలా న్యాయపరమైన విధివిధానాలను రూపొందించాలని లేఖలో కోరాయి.
